భలా భారత్.. చెస్‌లో అంతా చిచ్చరపిడుగులే..

-

చెస్ ఒలిపింయాడ్లో(Chess Olympiad) భారత జట్లు అదరగొట్టాయి. దశాబ్దాలుగా ఉన్న లోటును మన క్రీడాకారులు పూడ్చారు. చెస్ ఒలింపియాడ్‌లో పసిడి పతకాలను సొంతం చేసుకున్నారు. చదరంగం అదే చెస్‌కు భారత్ పుట్టినిల్లు. ఈ క్రీడలో ఎన్నో టైటిళ్లు భారత్ సొంతం. కానీ చెస్ ఒలిపింయాడ్ లో మాత్రం దశాబ్దాల పోరాటమే తప్ప.. పసిడి దక్కలేదన్న లోటు మిగిలిపోయింది. ఆ లోటునే ఇప్పుడు యువతరం ప్లేయర్లు పూడ్చేశారు. ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించిన స్వర్ణ పతాకం సొంతం చేసుకున్నారు. పురుషులు, మహిళలు రెండు జట్లు కూడా చెస్ ఒలింపియాడ్లో తమ పర్ఫార్మెన్స్‌తో ఔరా అనిపించాయి. ఈ చారిత్రాత్మక విజయాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన అర్జున్ ఇరిగేశి(Arjun Erigaisi), పెంటేల హరికృష్ణ(Pentala Harikrishna), ద్రోణవల్లి హారిక(Dronavalli Harika) కీలక పాత్ర పోషించారు. దశాబ్దాల నిరీక్షణకు తెరదించారు.

- Advertisement -

Chess Olympiad | ఓపెన్ విభాగంలో భారత పురుషుల జట్టు 21 పాయింట్లతో పసిడిని కైవసం చేసుకున్నారు. చివరిదైన 11వ రౌండ్లో 3.5-0.5 తేడాతో స్లోవేనియాను చిత్తు చేసింది భారత్. అమ్మాయిల జట్టు కూడా 3.5-0.5 తేడాతోనే అజర్‌భైజాన్‌ ఓడించేసింది. ఓపెన్‌లో 10 రౌండ్లు ముగిసే సరికి భారత్ 19, చైనా 17 పాయింట్లతో టాప్‌ స్థానాల్లో నిలిచాయి. ఆఖరి రౌండ్లో కూడా భారత్ పురుషులు, మహిళ జట్లు రెండూ కూడా అద్భుత ప్రదర్శన కనబరిచి విజేతగా నిలిచారు.

Read Also: అండాశయ ఆరోగ్యం కోసం మహిళలు ఈ ఆహారాలు తినాల్సిందే..!
Follow Us On: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

కండిషన్లు లేకుండానే చేరా.. ఉదయభాను..

వైసీపీ పార్టీని వీడిన మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను(Samineni Udayabhanu) ఈరోజు...

జనసేనలో చేరిన బాలినేని.. ఇంకో ఇద్దరు నేతలు కూడా..

వైసీపీకి తాజాగా రాజీనామా చేసిన ముగ్గురు కీలక నేతలు ఈరోజు డిప్యూటీ...