టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్..?

-

టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్(VVS Laxman) త్వరలోనే భారత పురుషుల క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరించనున్నారు. ప్రస్తుతం జరుగుతున్న వన్డే ప్రపంచకప్ ముగిసిన అనంతరం ఆస్ట్రేలియాతో భారత్ టీ20 సిరీస్ ఆడనుంది. నవంబరు 23 నుంచి జరగనున్న ఈ సిరీస్‌కు లక్ష్మణ్‌ తాత్కాలిక కోచ్‌గా వ్యవహరించే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం కోచ్‌గా వ్యవహరిస్తున్న రాహుల్ ద్రవిడ్ ఒప్పందం ప్రపంచకప్‌తో ముగియనుంది. దీంతో ద్రవిడ్ స్థానంలో తాత్కాలికంగా లక్ష్మణ్‌ను నియమించున్నారని తెలుస్తోంది..

- Advertisement -

హెడ్ కోచ్ పదవి కోసం బీసీసీఐ ఆశావహుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించనుంది. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి కోచ్‌ను నియమించనుంది. ఈ ప్రక్రియకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అందుకే ఈ లోపు జరిగే ఆసీస్ సిరీస్‌కు లక్ష్మణ్‌ను తాత్కాలికంగా కోచ్‌గా నియమించాలని బీసీసీఐ భావిస్తోందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Paris Olympics | పారిస్ ఒలింపిక్స్ జట్టులో తెలుగు తేజం

తెలుగు తేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్ లోనూ...

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....