Breaking: IND vs AUS మ్యాచ్..జింఖానా మైదానం వద్ద టెన్షన్..టెన్షన్..స్పృహతప్పిన 20 మంది అభిమానులు

0
59

ఆదివారం హైదరాబాద్ లోని ఉప్పల్ మైదానంలో ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ కు సంబంధించిన టికెట్లు సికింద్రాబాద్ జింఖానా మైదానంలో లభిస్తాయన్న విషయం తెలుసుకున్న అభిమానులు అక్కడకు భారీగా చేరుకున్నారు. దీనితో భారీగా క్యూ లైన్ ఏర్పడింది. ఈ క్రమంలో టికెట్ల కోసం అభిమానుల మధ్య తోపులాట జరిగింది. దీనితో జింఖానా మైదానం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఈ తోపులాటలో 20 మంది అభిమానులు స్పృహ తప్పినట్లు తెలుస్తుంది.