IND vs ENG | జైశ్వాల్ మెరుపు సెంచరీ.. భారీ ఆధిక్యంలో భారత్.. 

-

రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మూడో టెస్టులో రోహిత్ సేన పట్టు బిగిస్తోంది. మూడో రోజు ఆటలో భారత ప్లేయర్లు అదరగొట్టారు. ఓవర్‌ నైట్ స్కోర్ 207/2 పరుగుల వద్ద ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టుకు హైదరాబాదీ సిరాజ్ షాక్ ఇచ్చాడు. నాలుగు వికెట్లు తీసి ప్లేయర్లను కట్టడి చేశాడు. దీంతో ఇంగ్లీష్ టీమ్ 319 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో భారత్‌కు 126 పరుగుల ఆధిక్యం లభించింది. ఇండియా బౌలర్లలో జడేజా, కుల్‌దీప్ చెరో రెండు వికెట్లు.. అశ్విన్, బుమ్రా తలో వికెట్ తీశారు.

- Advertisement -

అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్‌ ఇంగ్లాండ్ బౌలర్లు విరుచుకుపడింది. ఓపెనర్ యశస్వి జైశ్వాల్ మెరుపు సెంచరీతో రెచ్చిపోయాడు. కేవలం 122 బంతుల్లో 100 పరుగులు చేశాడు. ఇందులో 9 ఫోర్లు, 5 భారీ సిక్సులు ఉన్నాయంటే మనోడి ఊచకోత ఏవిధంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు శుభమన్‌ గిల్ కూడా 65 పరుగులతో క్రీజులో ఉన్నాడు. మూడో రోజు ఆట ముగిసే నాటికి 196/2 పరుగులు చేసింది. దీంతో భారత్ మొత్తంగా 322 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...