ఐర్లాండ్ చిత్తు.. సిరీస్‌పై కన్నేసిన టీమిండియా

-

IND vs IRE | ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను 02-00తో సిరీస్‌ను దక్కించుకున్నది. ముందుగా భారత్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 185 పరుగులు చేసింది. మెక్‌కార్తికి రెండు వికెట్లు దక్కాయి. ఛేదనలో ఐర్లాండ్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 152 పరుగులు చేసి ఓడింది. బల్బిర్నీ (51 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 72) పోరాడాడు. ప్రసిద్ధ్‌, బిష్ణోయ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా రింకూ సింగ్‌ నిలిచాడు.

- Advertisement -

IND vs IRE | ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు అదరగొట్టారు. ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (43 బంతుల్లో 58 పరుగులు), సంజూ శాంసన్‌ (26 బంతుల్లో 40 పరుగులు)తో ఆకట్టుకున్నాడు. ఇక తొలిసారి అంతర్జాతీయ మ్యాచ్‌లో బ్యాట్‌ చేతపట్టిన రింకూ సింగ్‌ (21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 38) సూపర్‌ ఫినిషింగ్‌తో తనపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసుకున్నాడు. ఫలితంగా ఆదివారం జరిగిన రెండో టీ20లో భారత జట్టు 33 పరుగుల తేడాతో ఐర్లాండ్‌పై గెలిచింది.

Read Also: తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సంచలన ప్రకటన
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...