డబ్ల్యూటీసీకి ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ!

-

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్(WTC) షిప్ ఫైనల్ కు ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. టీమ్ ఇండియా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్(Ishan Kishan) గాయపడ్డాడు. ఐపీఎల్‌లో భాగంగా శుక్రవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది. ముంబైకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇషాన్.. 16వ ఓవర్ ముగిసిన తర్వాత కీపింగ్ చేసేందుకు మరో ఎండ్‌కు వెళుతున్న సమయంలో అదే జట్టుకు చెందిన బౌలర్ జోర్డాన్‌ను అనుకోకుండా ఢీకొట్టాడు. జోర్డాన్ మోచేయి ఇషాన్ కంటికి తగలడంతో అతను నొప్పితో విలవిల్లాడాడు. దాంతో కీపింగ్ చేయలేక మైదానాన్ని విడిచి వెళ్లాడు. అతని స్థానంలో వినోద్ కీపింగ్ చేయగా, బ్యాటింగ్‌కు సైతం ఇషాన్ రాలేకపోయాడు. అయితే, వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు ముందు ఇషాన్ గాయపడటం టీమ్ ఇండియాను కలవరపెడుతోంది. కేఎల్ రాహుల్ గాయం కారణంగా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూరం కావడంతో అతని స్థానంలో ఇషాన్‌(Ishan Kishan)ను భర్తీ చేసిన విషయం తెలిసిందే.

Read Also:
1. YS వివేకానంద రెడ్డి హత్య కేసు: అవినాష్ రెడ్డికి భారీ ఊరట
2. యూట్యూబ్‌లో ఇకనుంచి ఆ ఫీచర్ కనిపించదు!
Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...