కివీస్ బౌలర్ల దెబ్బకు తక్కువ పరుగులకే శ్రీలంక ఆలౌట్

-

World Cup | వరల్డ్‌కప్‌ టోర్నీలో సెమీస్ చేరుకోవాలంటే తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఆటగాళ్లు అదరగొట్టారు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో శ్రీలంకతో జరిగుతున్న మ్యాచులో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్.. లంకను 46.4 ఓవర్లలో 171 పరుగులకే ఆలౌట్ చేసింది. ఓపెనర్ కుశాల్ పెరీరా (51; 28 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒక్కడే రాణించాడు. మిగతా ఆటగాళ్లు పాథుమ్ నిశాంక (2), కుశాల్ మెండిస్ (6), సదీరా సమరవిక్రమ (1), చరిత్ అసలంక (8), ఏంజెలో మాథ్యూస్ (16), ధనంజయ డిసిల్వా (19), కరుణరత్నె (6), దుష్మంత చమీరా (1) వరుసగా పెవిలియన్ బాట పట్టారు.

- Advertisement -

World Cup | 128 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయిన లంకను బౌలర్ మహీశ్ తీక్షణ ఆదుకున్నాడు. 91 బంతుల్లో 3 ఫోర్లతో 38 పరుగులు సాధించాడు. దిల్షాన్ మధుశంక (19) కూడా పోరాడడంతో శ్రీలంక 171 పరుగులైనా చేయగలిగింది. వీరిద్దరు కలిసి పదో వికెట్‌కు 43 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 3, ఫెర్గూసన్ 2, మిచెల్ శాంట్నర్ 2, రచిన్‌ రవీంద్ర 2, టిమ్ సౌథీ ఒక వికెట్ పడగొట్టారు.

Read Also: వామ్మో.. ‘గేమ్‌ ఛేంజర్‌’ ఆడియో రైట్స్ ఎంతో తెలుసా..?
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....

THSTI లో ప్రాజెక్ట్ రీసెర్చ్ స్టాఫ్ కి నోటిఫికేషన్

ఫరీదాబాద్ (హరియాణా)లోని ప్రభుత్వరంగ సంస్థకు చెందిన ట్రాన్టేషనల్ హెల్త్ సైన్స్ అండ్...