ఫైనల్స్‌లో భారత్‌ ఘోరఓటమి.. టైటిల్ సిరియాదే..

-

హైదరాబాద్ వేదికగా జరిగిన ఇంటర్ కాంటినెంటల్ 2024 టోర్నీ(Intercontinental Cup 2024) టైటిల్ సిరియా సొంతమైంది. భారత్, సిరిమా మధ్య జరిగిన హోరాహోరీ పోరులో భారత్‌ను పరాజయం పలకరించింది. గచ్చిబైలి స్టేడియంలో మూడు దేశాల మధ్య రౌండ్ రాబిన్ లీడ్ తరహాలో ఈ టోర్నీ జరిగింది. ఈ టోర్నీ ఫైనల్‌లో భారత్, సిరియా తలపడ్డాయి. కానీ ఆరంభం నుంచి సిరియా తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. మ్యాచ్ పూర్తయ్యే సరికి సిరియా 3-0 తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. భారత్, సిరియా, మారిషస్ మధ్య జరిగిన ఈ టోర్నీలో సిరియా.. భారత్‌పై 3 పాయింట్లు, మారిషస్‌పై 2 పాయింట్లతో గెలిచి అత్యధిక స్కోర్‌తో అగ్రస్థానంలో నిలిచి టైటిల్‌ను తన సొంతం చేసుకుంది.

- Advertisement -

Intercontinental Cup 2024 | ఈ టోర్నీ ఫైనల్‌లో అన్ని విభాగాల్లోనూ డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ విఫలమైంది. మ్యాచ్ స్టార్ అయిన ఏడో నిమిషంలోనే ఒక పాయింట్‌ను సిరియా చేతిలో పెట్టింది. ఆ తర్వాత పలు అవకాశాలు వచ్చినా వాటిని కూడా సద్వినియోగం చేసుకోలేక పోయింది భారత జట్టు. ఘోట్స్ కోసం నువ్వానేనా అన్నట్లు రెండు జట్లు తలపడ్డాయి. కానీ బంతిని సిరియా ఆధీనంలోనే ఉండటం భారత డిఫెన్స్‌కు అగ్నిపరీక్షలా మారింది. ఫస్టాఫ్ ముగిసేసరికి 1-0తో సిరియా ఆధిక్యంలో ఉంది. రెండో సగం మ్యాచ్‌లో భారత్ కూడా కాస్తంత పుంజుకుని గట్టి పోటీ ఇచ్చింది. కానీ 76వ నిమిషంలో మరో గోల్ చేసింది సిరియా. ఎక్స్‌ట్రా టైమ్‌లో ముచ్చటగా మూడో గోల్ చేసి విజయం సాధించింది.

Read Also: పొంగిన ఏలేరు.. రాకపోకలు బంద్..
Follow Us On: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

నల్ల మిరియాలతో ఆ సమస్యలకు చెక్..

భారతదేశంలోని ప్రతి వంటగదిలో ఉండే మసాలా దినుసు మిరియాలు(Black Pepper). వీటిని...

మందుబాబులకు గుడ్‌న్యూస్.. తక్కువ ధరకే మద్యం

నూతన మద్యం పాలసీ రూపకల్పన కోసం కూటమి సర్కార్ ఏర్పాటు చేసిన...