హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో జట్టుకు ఇది మూడో ఓటమి

-

వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా మరోసారి నిరాశపరిచింది. గురువారం రాత్రి బ్రియాన్ లారా స్టేడియం వేదికగా జరిగిన టీ20 మ్యాచ్‌లో ఘోర పరాభవం పాలైంది. హార్దిక్ పాండ్యా(Hardik Pandya) కెప్టెన్సీ కెరీర్‌లో టీమ్ ఇండియాకు ఇది మూడో ఓటమి కావడం గమనార్హం. ఈ విజయంతో 5 మ్యాచ్‌ల సిరీస్‌లో వెస్టిండీస్ జట్టు 1-0 ఆధిక్యంలో నిలిచింది.

- Advertisement -

వెస్టిండీస్ నిర్ధేశించిన 150 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఛేదించలేక 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. యువ బ్యాట్స్‌మెన్ తిలక్ వర్మ అరంగేట్రం చేసి టీమిండియా తరపున అత్యధిక పరుగులు చేశాడు. వెస్టిండీస్ అత్యుత్తమ బౌలింగ్ ముందు మిగిలిన బ్యాట్స్‌మెన్స్ చిత్తయ్యారు. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 149 పరుగులు చేసింది. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 20 ఓవర్లలో 8 వికెట్లకు 145 పరుగులు మాత్రమే చేయగలిగింది.

Read Also: నేడు అసెంబ్లీలో ప్రవేశ పెట్టే బిల్లులు ఇవే!
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...