Yashasvi Jaiswal | ముగిసిన తొలి రోజు ఆట.. సెంచరీతో రెచ్చిపోయిన యశస్వి..

-

Yashasvi Jaiswal | విశాఖపట్నం వేదికగా భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. ఆట ముగిసే సమయానికి 6 వికెట్లకు 336 పరుగులు చేసింది. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్ 179 పరుగులు చేసి అజేయంగా నిలిచి డబుల్ సెంచరీకి దగ్గర్లో ఉన్నాడు. ఇన్నింగ్స్ ప్రారంభం నుంచి దూకుడుగా ఆడిన యశస్వి ఇంగ్లీష్‌ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. ఫోర్లు, సిక్సర్లతో ధాటిగా ఆడాడు. ఈ క్రమంలోనే తన కెరీర్‌లో రెండో సెంచరీ చేశాడు.

- Advertisement -

మరోవైపు రోహిత్ శర్మ(14), శుభ్‌మన్‌ గిల్‌(34), రజత్‌(32), శ్రేయస్‌ అయ్యర్‌(27), అక్షర్‌ పటేల్‌(27) పరుగులు చేశారు. క్రీజులో పాతుకుపోయిన జైస్వాల్(Yashasvi Jaiswal).. గిల్‌తో రెండో వికెట్‌కు 49 ప‌రుగులు, శ్రేయ‌స్‌తో మూడో వికెట్‌కు 79 ప‌రుగులు, పాటిదార్ తో నాలుగో వికెట్‌కు 70 ప‌రుగులు, అక్షర్ ప‌టేల్‌తో ఐదో వికెట్‌కు 52 ప‌రుగుల భాగ‌స్వామ్యాల‌ను నెల‌కొల్పాడు. ప్రస్తుతం క్రీజులో జైస్వాల్, అశ్విన్ ఉన్నారు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో షోయబ్‌ బషీర్‌ 2, రెహాన్‌ 2, జేమ్స్‌ అండర్సన్‌, టామ్‌ హార్ట్‌లీ ఒక్కో వికెట్‌ తీశారు.

Read Also: తిన్న కంచంలో చెయ్యి కడగకూడదు అంటారు ఎందుకు?
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్...