Betting Apps Case | బెట్టింగ్‌కు ఏడాదిలో 15 మంది బలి

-

Betting Apps Case | బెట్టింగ్ యాప్‌ల వ్యవహారం ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారింది. వీటిని ప్రమోట్ చేస్తున్న వారిపై పోలీసులు ఇప్పటికే కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలోనే అసలు రాష్ట్రంలో బెట్టింగ్ యాప్‌లకు ఎంత మంది బలయ్యారు అన్న అంశంపై పోలీసులు ఫోకస్ పెట్టారు. దీంతో ఈ కేసు కీలక మలుపు తీసుకుంది. పోలీసులు సేకరించిన వివరాల ప్రకారం ఒక్క ఏడాదిలోనే బెట్టింగ్ ఊబిలో చిక్కుకుని 15 మంది ఆత్మహత్యలు చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయాన్ని పోలీసులు ప్రకటించారు. వారి ఆత్మహత్య కేసులకు సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

- Advertisement -

Betting Apps Case | వీరి ఆత్మహత్యలకు బెట్టింగ్‌లే కారణమని ఆధారాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా వారు ఏ బెట్టింగ్ యాప్‌లను వినియోగించారు అనే అంశాలను కూడా కనుగొనే పనిలో పడినట్లు పోలీసులు వివరించారు. వాటి నిర్వాహకులు ఎవరు, ప్రమోటర్లు ఎవరు, ఎక్కడి నుంచి ఆ యాప్‌లను నిర్వహిస్తున్నారు వంటి వివరాలను కూడా సేకరిస్తున్నట్లు తెలిపారు.

Read Also: హైదారాబాద్ లో దూసుకుపోతున్న బంగారం ధరలు
Follow Us : Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...