25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతున్నారు: ఉత్తమ్

-

25 మంది బీఆర్‌స్ ఎమ్మెల్యేలు త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అహంకారపూరిత వైఖరి వల్లే బీఆర్ఎస్ పార్టీకి ఈ దుస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. కరీంనగర్‌లో రైతులను పరామర్శించడానికి వెళ్లిన కేసీఆర్ పిచ్చి పిచ్చిగా మాట్లాడారని మండిపడ్డారు.

- Advertisement -

“తెలంగాణ ప్రజలు కేసీఆర్‌(KCR)ను బొంద పెడితే 104 మంది ఎమ్మెల్యేల నుంచి 39కి పడిపోయారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత నిన్ను, నీ పార్టీని ప్రజలు బొంద పెట్టడం ఖాయం. నీకు తెలివి తక్కువ, పొగరు ఎక్కువ. ఎక్కువ తక్కువ మాట్లాడితే ఎవ్వరూ పడరు. ప్రపంచంలో నువ్వొక్కడివే మేధావివా? మేడిగడ్డ కుంగింది అన్నప్పుడు ఎక్కడ ఉన్నావ్. మాకు అభివృద్ధి చేయడం తెలుసు, నీకు కమిషన్లు తీసుకోవడం తెలుసు. రైతులు ప్రస్తుతం ఇబ్బందులు పడడానికి కేసీఆరే కారకుడు. వ్యక్తిగత లాభం కోసం కృష్ణా, సాగర్ జలాలను ఏపీకి తాకట్టు పెట్టారు. ఎన్నికల తర్వాత మేడిగడ్డకు వెళ్తాడు అంట.. ప్రజలు నిన్ను తొక్కుకుంటూ పోతారు. సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతున్నావ్.

కేసీఆర్ తీసుకొచ్చిన కరువు ఇది. కేసీఆర్ పాలనలో ఏ ప్రాజెక్టు కూడా సక్రమంగా డిజైన్ చేయలేదు. బ్యారేజీలకు, డ్యామ్‌లకు తేడా తెలియని వ్యక్తి కేసీఆర్. లక్ష కోట్లు అప్పు తెచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి.. చిన్న చిన్న తప్పులు అని సిగ్గులేకుండా మాట్లాడుతున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ప్రతి సంవత్సరం 17 వేల కోట్లు అప్పు కట్టాల్సి వస్తోంది. కేసీఆర్ అన్ని అసత్యాలే మాట్లాడుతున్నాడు ఆయన మాటలు నమ్మొద్దు. నష్టపోయిన ప్రతి రైతుకు మా సానుభూతి, నష్టపరిహారం ఉంటుంది”అని ఉత్తమ్(Uttam Kumar Reddy) తెలిపారు.

Read Also: సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

మహిళను కొట్టిన కాంగ్రెస్ అభ్యర్థి.. తీవ్రంగా స్పందించిన కేటీఆర్..

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతోంది. గెలుపే లక్ష్యంగా అన్ని...

బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎంపీ రాజీనామా

బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది కీలక...