హైదరాబాద్ లో మరో విషాదం.. నీటిగుంతలో పడి బాలుడు మృతి

-

హైదరాబాద్(Hyderabad) లో అకాల వర్షాలు జనాల ప్రాణాలు తీస్తున్నాయి. కుండపోత వర్షాలతో రోడ్లన్ని నీటితో మునిగిపోతున్నాయి. దీంతో ఎక్కడ ఏ గుంత ఉందో తెలియడం లేదు. ఇటీవలే సికింద్రాబద్ కళాసిగూడలోని నాలాలో పడి మౌనిక అనే చిన్నారి మృతి చెందిన ఘటన మరవక ముందే మరో దుర్ఘటన చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 45లో వివేకానంద అనే ఆరేళ్ల బాలుడు ప్రమాదవశాత్తూ నీటి గుంతలో పడి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. కాగా కాకినాడకు చెందిన భీమ్‌శంకర్‌ తన భార్య పిల్లలతో కలిసి జూబ్లీహిల్స్‌లోని ఓ బైక్‌షోరూంలో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. అతని కుమారుడు వివేకానంద స్నేహితులతో కలిసి ఇంటి వద్ద ఆడుకుంటుండగా పక్కనే ఉన్న గుంతలో పడిపోయాడు. పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
Read Also: చీకోటి ప్రవీణ్‌ను దేశం నుంచి బహిష్కరించాలి

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సీఎం జగన్ వ్యాఖ్యలపై వైఎస్ షర్మిల కంటతడి..

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) కంటతడి పెట్టారు. షర్మిల...

ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం.. ప్రభాకర్‌ రావుకు అరెస్ట్ వారెంట్ జారీ..!

తెలంగాణలో ప్రకంపనలు రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో కీలక...