SLBC Tunnel | ఎస్‌ఎల్‌బీసీ ఘటన.. ఎనిమిది మంది గల్లంతు

-

శ్రీశైలం ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రాజెక్ట్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎస్‌ఎల్‌బీసీ ఎడమవైపు టన్నెల్ పనులు జరుగుతుండగా సుమారు 14వ కిలోమీటర్ దగ్గర ప్రమాదం చోటుచేసుకుంది. టన్నెల్ బోర్ మిషన్‌తో పని జరుగుతున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. టన్నెల్ పైకప్పు ఒక్కసారిగా కూలింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది గల్లంతయ్యారు. వారిలో ఆరుగురు కార్మికులు కాగా ఇద్దరు ఇంజనీర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారిని రక్షించడానికి సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నప్పటికీ.. వారి ప్రాణాలపై ఆశలు సన్నగిల్లుతున్నాయి.

- Advertisement -

ఈ రెస్క్యూ ఆపరేషన్స్‌ను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy), జూపల్లి కృష్ణా రావు(Jupally Krishna Rao) పర్యవేక్షిస్తున్నారు. వారంతా కూడా బురదలో చిక్కుకున్నట్లు మాత్రం ఇప్పటి వరకు తెలిసింది. దీంతో వారిని రక్షించడానికి అధికారులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఏమాత్రం అవకాశం ఉన్నా ఆ ప్రయత్నాన్ని ఆచరణలో పెడుతూ ఇరుక్కున్న వారిని రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో ఆర్మీ, రెస్క్యూ టీమ్ సహాయం కూడా కోరినట్లు అధికారులు తెలిపారు.

టన్నెల్(SLBC Tunnel) బోరింగ్ మిషన్‌తో పని మొదలు పెట్టగా.. మట్టి, నీరు వచ్చి చేరిందని, అది 8మీటర్ల వరకు చేరిందని అధికారులు చెప్పారు. కాగా, ఈ ప్రమాదంలో ఇక్కుకున్న ఇద్దరు ఇంజనీర్లు అమెరికా కంపెనీకి చెందిన వారిగా తెలుస్తోంది. కార్మికులు వచ్చేసరికి జయప్రకాష్ అసోసియేట్స్ ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. గల్లంతైన రాబిన్స్ కంపెనీ ఉద్యగులు అమెరికన్లా? భారతీయులా? అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.

Read Also: అంజనీకుమార్‌ను రిలీవ్ చేసిన తెలంగాణ సర్కార్
Follow Us : Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...

YS Jagan | అసెంబ్లీలో అడుగు పెట్టడానికి జగన్ రెడీనా!

అధికారం చేజారిన తర్వాత జగన్(YS Jagan).. అసెంబ్లీ మొఖం కూడా చూడలేదు....