తన చితిని తానే పేర్చుకొని 90 ఏళ్ల వృద్ధుడు ఆత్మహత్య

-

సిద్దిపేట(Siddipet) జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. తన చితిని తానే పేర్చుకొని 90 ఏళ్ల వృద్ధుడు ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఆత్మహత్యకు ముందు తనకున్న నాలుగెకరాల భూమిని నలుగురు కొడుకుల పేరుమీద రిజిస్ట్రేషన్ చేయించినట్లు సమాచారం. దీంతో తండ్రిని వంతుల వారీగా చూసుకుంటామని కొడుకులు నిర్ణయించుకున్నారు. మొదటినెల సొంత ఊర్లనే ఉంటున్న పెద్ద కుమారుడి వద్ద ఉన్న వెంకటయ్య, రెండో నెలకోసం నవాబుపేటలో ఉంటున్న రెండో కుమారుడి వద్దకు వెళ్లాల్సి ఉంది. అయితే.. ఈ క్రమంలో తాను కుమారులకు భారం అవుతున్నానేమో అనే మనస్థాపంతో సొంత ఊరికి వదిలి వెళ్లలేక వెంకటయ్య ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
Read Also: రొమాన్స్ చేయడానికే తీసుకుంటున్నారు: అనసూయ షాకింగ్ కామెంట్స్

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...