Criminal Cases | క్రిమినల్ కేసులున్న ఎమ్మెల్యేలలో ఏపీ, తెలంగాణ టాప్

-

క్రిమినల్ కేసులు(Criminal Cases) ఉన్న ఎక్కువమంది ఎమ్మెల్యేల లిస్టులో తెలుగు రాష్ట్రాలు టాప్ లో నిలిచాయి. మొదటి స్థానంలో ఏపీ ఉండగా, రెండవ స్థానంలో తెలంగాణ నిలవడం విశేషం. తాజాగా ఎమ్మెల్యేల క్రిమినల్ కేసుల డేటాను అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) ప్రకటించింది. 28 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీలలోని 4,123 మంది ఎమ్మెల్యేలలో 4,092 మంది అఫిడవిట్లను ఆ సంస్థ విశ్లేషించింది.

- Advertisement -

4,092 మంది ఎమ్మెల్యేలలో కనీసం 45 శాతం మందిపై క్రిమినల్ కేసులు(Criminal Cases) ఉన్నాయని ఎన్నికల హక్కుల సంస్థ ADR విశ్లేషణలో తేలింది. సరిగ్గా స్కాన్ చేయకపోవడం వలనో, చదవడానికి వీలుగా లేని కారణంగానో 24 మంది ఎమ్మెల్యేల అఫిడవిట్లను విశ్లేషించడం సాధ్యం కాలేదని తెలిపింది. తాజా ADR నివేదిక ప్రకారం, 1,861 మంది ఎమ్మెల్యేలు తమ పేర్లపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీరిలో 29 శాతం అంటే 1,205 మంది ఎమ్మెల్యేలు హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు సహా తీవ్రమైన క్రిమినల్ అభియోగాలను ఎదుర్కొంటున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ లో 138 మంది ఎమ్మెల్యేలు (79 శాతం) తమ పేర్లపై క్రిమినల్ కేసులున్నట్లు అఫిడవిట్లలో పేర్కొని అగ్రస్థానంలో ఉండగా… కేరళ, తెలంగాణల్లో చెరో 69 శాతం మందిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. బీహార్ (66 శాతం), మహారాష్ట్ర (65 శాతం), తమిళనాడు (59 శాతం) ఉన్నాయి. 98 (56 శాతం) మందితో, తీవ్రమైన క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న శాసనసభ్యుల జాబితాలో కూడా ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. తీవ్రమైన క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న శాసనసభ్యులలో గణనీయమైన నిష్పత్తి ఉన్న ఇతర రాష్ట్రాలలో తెలంగాణ (50 శాతం), బీహార్ (49 శాతం), ఒడిశా (45 శాతం), జార్ఖండ్ (45 శాతం), మహారాష్ట్ర (41 శాతం) ఉన్నాయి.

ఈ విశ్లేషణ ప్రస్తుత ఎమ్మెల్యేలలో పార్టీల వారీగా క్రిమినల్ కేసుల డేటాను సైతం వెల్లడించింది. బీజేపీకి చెందిన 1,653 మంది ఎమ్మెల్యేలలో 39 శాతం అంటే దాదాపు 638 మందిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వారిలో 436 (26 శాతం) మందిపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన 646 మంది ఎమ్మెల్యేలలో 339 (52 శాతం) మందిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 194 (30 శాతం) మందిపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. టీడీపీలో అత్యధికంగా క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ఉన్నారు. 134 మంది ఎమ్మెల్యేలలో 115 మంది తమ పేర్లపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించారు. వీరిలో 82 మంది తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ఉన్నారు.

Read Also: శ్రీవారి ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనం టోకెన్‌లు రిలీజ్ చేసిన TTD
Follow Us on : Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | బీజేపీ ఎంపీతో కలిసి HCU భూముల్లో రేవంత్ భారీ స్కామ్ -KTR

KTR - Revanth Reddy | కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం...

Mumbai Attacks | 26/11 ముంబై ఉగ్ర దాడుల కేసులో కీలక పరిణామం

26/11 ముంబై ఉగ్రవాద దాడుల(Mumbai Attacks) కేసులో కీలక పరిణామం చోటు...