Soyam Bapu Rao | ఆ నిధులను సొంత అవసరాలకు వాడుకున్నా.. తప్పేంటి?: BJP MP

-

ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపూరావు(Soyam Bapu Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఎంపీ నిధులను సొంత అవసరాలకు వాడుకున్నానని అలా వాడుకుంటే తప్పేంటి? అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై విపక్ష, సొంత పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు కానీ నా నిధులు నా వ్యక్తిగత అవసరాలకు వాడుకుంటే తప్పేంటి? అంటూ ప్రశ్నించారు. నా ఇంటి నిర్మాణం కోసం, నా కుమారుడు పెళ్లి కోసం నిధులు వాడుకున్నానని వివరణ ఇచ్చారు. దీనిపై విపక్షాలు విమర్శలు చేస్తుంటే తాను చేసిన దాంట్లో తాప్పేముంది అని అడిగారు. ఎంతోమంది ఎంపీలు తమ నిధుల్ని ఇష్టానుసారంగా వాడేసుకున్నారు. అలాగే నేను కూడా వాడుకున్నాను. కానీ తాను వాడిన ప్రతీ రూపాయి తిరిగి లబ్ధిదారులకు ఇచ్చేస్తున్నాను అని చెప్పుకొచ్చారు. ఎంపీ లాడ్స్ నిధులు(MP Lands Funds) సొంతానికి వాడుకున్న విషయంపై వచ్చే విమర్శలను ఏమాత్రం పట్టించుకోనంటూ కొట్టిపారేశారు. ఎంపీ లాడ్స్ నిధులకు సంబంధించిన చెక్కులను పంచుతూ ఈ వ్యాఖ్యలు చేశారు సోయం బాపూరావు(Soyam Bapu Rao).

- Advertisement -
Read Also:
1. రూ.10 కోసం కక్కుర్తిపడి పోలీసులకు చిక్కిన గజదొంగ
2. సీఎం జగన్ ప్రజాసంపదను కొల్లగొడుతున్నారు: విష్ణువర్ధన్ రెడ్డి

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

హైదారాబాద్ మెట్రోకి మరో ప్రతిష్టాత్మక అవార్డు

హైదారాబాద్ మెట్రో(Hyderabad Metro)కి మరో ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ఇటీవల పని...

‘కల్కి2898 ఏడీ’లో కృష్ణుడు ఇతనే..

అమితాబ్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొనే వంటి అగ్ర నటీనటులు...