బీసీలకు టికెట్ల కేటాయింపు పై కాంగ్రెస్ హైకమాండ్ కీలక ఆదేశాలు

-

బీసీలకు 60 సెగ్మెంట్లు కేటాయించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా హస్తం పార్టీలో డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు బీసీలకు ఏయే సీట్లు ఇవ్వాలనేది.. వెంటనే ప్రతిపాదనలు పంపాలని ఏఐసీసీ నుంచి రాష్ట్ర కాంగ్రెస్కు(Telangana Congress) ఆదేశాలు అందాయి. ఆ తర్వాతనే అభ్యర్థుల అంశం తేల్చుదామని చెప్పినట్లు సమాచారం. స్టేట్ కమిటీలో చర్చించి వెంటనే సెగ్మెంట్ల పేర్లను పంపించాలని హైకమాండ్ సూచించినట్లు తెలిసింది. దీంతో రాష్ట్ర పార్టీ బీసీలకు ఇవ్వాలనుకుంటున్న సెగ్మెంట్లను ఎంపిక చేసే పనిలో నిమగ్నమైంది.

- Advertisement -

మరోవైపు ప్రతీ పార్లమెంట్ పరిధిలో రెండు అసెంబ్లీ సెగ్మెంట్లను ఇవ్వాలని రాష్ట్ర పార్టీ ఆలోచిస్తున్నది. కానీ.. జనాభా ప్రతిపాదికన తమకు 60 సీట్లు ఇవ్వాల్సిందేనని బీసీ నేతలు పట్టుబడుతున్నారు. దీంతో బీసీ సెగ్మెంట్లను ఎంపిక చేయడం పార్టీకి సవాల్గా మారింది. బీసీలకు ప్రాథమికంగా 34 సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఆలో చనలో ఉంది. ఎలా ఇవ్వాలి? ఏ వర్గానికి ఎన్ని ఇవ్వాలి? ఉప కులాల పరిస్థితి ఏంటి? సమీకరణల వారీగా సాధ్య మవుతుందా? అనే అంశాలు పార్టీని సతమతం చేస్తున్నాయి.

ఇటీవల జరిగిన బీసీ నేతల సమావేశం. లోనూ కాంగ్రెస్(Telangana Congress) సీనియర్లు వి. హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య లాంటి నేతలు కూడా జనాభా ప్రాతి పాదికనే సీట్లు ఇవ్వాలనే డిమాండ్ను తెరమీదకు తెచ్చారు. దీంతో జనరల్ సీట్లలో బీసీలకు సీట్లు సర్దుబాటు చేయడం కోసం పార్టీ కసరత్తు చేస్తున్నది.. ఒకవేళ అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లలో రెండు సీట్లు ఇవ్వడం కుదరకపోతే,, బీసీల నుంచి వ్యతిరేకత వచ్చే చాన్స్ ఉన్నది. మరోవైపు వీసీలకు ఇవ్వాల్సిన చోట ఇప్పటికే ఐలమైన అభ్యర్థి ఉంటే.. ఇరు నేతలను సమన్వయం ఎలా? అంటూ కాంగ్రెస్ పార్టీ మదనపడుతున్నది.

Read Also: సౌదీ యువరాజుతో ముగిసిన మోదీ భేటీ.. కుదిరిన కీలక ఒప్పందాలు
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

పెళ్ళై పిల్లలున్న వ్యక్తితో డేటింగ్‌పై సాయిపల్లవి క్లారిటీ

సాయి పల్లవి(Sai Pallavi) ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. నేచురల్ బ్యూటీగా...

అసెంబ్లీలో వాళ్లందర్నీ నిలబెట్టిన సీఎం..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని...