Group 2 Exam | గ్రూప్-2 పరీక్షలకు అంతా సిద్ధం..

-

తెలంగాణలో గ్రూప్-2 పరీక్షల(Group 2 Exam) నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు TGPSC ఛైర్మన్ బుర్రా వెంకటేశం(Burra Venkatesham) వెల్లడించారు. డిసెంబర్ 15, 16 తేదీల్లో ఈ పరీక్షలు జరగనున్నాయని చెప్పారు. ఒక్కో పరీక్ష 150 మార్కులకు జరుగుతుందని, మొత్తం పరీక్షలు కలుపుకుని 600 మార్చులకు జరుగుతాయని వివరించారు. 783 గ్రూప్-2 పోస్ట్‌లకు నోటిఫికేషన్ విడుదల చేయగా వీటికి మొత్తం 5,51,943 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఆయన వివరించారు. ఈ పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5:30 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నట్లు తెలిపారు.

- Advertisement -

‘‘గ్రూప్-2 పరీక్షలు ఇప్పటి వరకు ఎగ్జామ్ 4 సార్లు పోస్ట్పోన్ అయింది. 1,368 కేంద్రాలులో పరీక్ష నిర్వహణ జరుగుతుంది. 49,843 మంది సిబ్బంది పరీక్షకు అందుబాటులో ఉంటారు. ఇప్పటి వరకు 77% హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. 80 శాతం పైగా డౌన్లోడ్ చేసుకుంటారు అని అంచనా వేస్తున్నాం. అభ్యర్థులు ఎవరూ ఆందోళన చెందవద్దు…. ఎలాంటి అపోహలు వద్దు. చైర్మన్‌గా నాకు ఉన్న అధికారాలు అన్ని మీకోసం ఉపయోగిస్తాను.

Group 2 Exam | బయో మెట్రిక్ కచ్చితంగా ఇవ్వాలి లేకుంటే జవాబు పత్రం తిరస్కరించపడుతుంది. గతంలో నోటిఫికేషన్ వచ్చినప్పుడు పూర్తి అవడానికి 4 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు చాలా తొందరగా ఫలితాలు విడుదల చేస్తాము. ప్రతి సెంటర్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాము. క్వశ్చన్ పేపర్ అభ్యర్థులకు తప్ప ఎవరికీ తెలియకుండా జాగత్రలు తీసుకున్నాము’’ అని తెలిపారు.

Read Also: పరారీలో మోహన్ బాబు.. క్లారిటీ ఇచ్చిన నటుడు..
Follow US: Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...