CM Jagan | బీఆర్ఎస్ చీఫ్‌ కేసీఆర్‌ను పరామర్శించిన ఏపీ సీఎం జగన్

-

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌(KCR)ను ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి(CM Jagan) పరామర్శించారు. ఇవాళ ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బయలుదేరిన జగన్‌.. 11:30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు మాజీ మంత్రి ప్రశాంత్‌ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి స్వాగతం పలకగా.. రోడ్డు మార్గాన బంజారాహిల్స్‌ నందినగర్‌లోని కేసీఆర్‌ నివాసానికి వెళ్లారు.

- Advertisement -

మాజీ మంత్రులు కేటీఆర్(KTR), తలసాని శ్రీనివాస యాదవ్(Talasani Srinivas Yadav), మహమూద్ అలీ జగన్‌కు స్వాగతం పలికి ఇంటి లోపలికి తీసుకుని వెళ్లారు. అనంతరం ఆయన కేసీఆర్‌ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జగన్(CM Jagan) వెంట ఎంపీ మిథున్ రెడ్డి(Mithun Reddy) ఉన్నారు. కాగా గత నెల కేసీఆర్ కాలుజారి కిందపడటంతో వైద్యులు తుంటి మార్పిడి చికిత్స చేశారు. డిశ్చార్జ్ అనంతరం తన నివాసంలో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు.

CM Jagan

Read Also: కాంగ్రెస్‌ పార్టీలో చేరిన వైయస్ షర్మిల
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

వైసీపీ హయాంలో అభివృద్ధి శూన్యం.. ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు..

వైసీపీ ప్రభుత్వంలో అవినీతి ఫుల్ స్పీడ్‌లో ఉండగా, అభివృద్ధికి బ్రేక్ పడిందని...

జగన్‌ పాలనపై రేణుకాచౌదరి తీవ్ర విమర్శలు

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు, రాజ్యసభ...