Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇంట తీవ్ర విషాదం

-

తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సోదరుడు మల్లు వెంకటేశ్వర్లు కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కొద్ది రోజులుగా ఆయన కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఆరోగ్యం క్షీణించటంతో ఇటీవల ఏఐజీ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అయితే మూడు రోజుల క్రితం గుండెపోటు రావడంతో ఆరోగ్య పరిస్థితి క్షీణించి ఇవాళ ఉదయం మృతిచెందారు. స్వగ్రామమైన స్నానాల లక్ష్మీపురంలో సాయంత్రం 5 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దీంతో భట్టి విక్రమార్క హుటాహుటిన స్వగ్రామం బయలుదేరారు.

- Advertisement -

హోమియో ఎండీ చదివిన మల్లు వెంకటేశ్వర్లు(Mallu Venkateswarlu).. ఆయుష్ శాఖలో ప్రొఫెసర్‌గా, అడిషనల్ డైరెక్టర్‌గా పనిచేసి పదవి విరమణ చేశారు. అనంతరం వైరాలోని తన నివాసంలో హోమియో వైద్యశాలను నిర్వహిస్తున్నారు. ఆయనకు హోమియో వైద్యంలో ఎంతో మంచి పేరు ఉంది. దీంతో ఆయన మరణవార్తతో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Read Also: కాంగ్రెస్‌లోకి హరీష్‌రావు వస్తే మంత్రి పదవి ఇస్తాం

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | బీజేపీ ఎంపీతో కలిసి HCU భూముల్లో రేవంత్ భారీ స్కామ్ -KTR

KTR - Revanth Reddy | కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం...

Mumbai Attacks | 26/11 ముంబై ఉగ్ర దాడుల కేసులో కీలక పరిణామం

26/11 ముంబై ఉగ్రవాద దాడుల(Mumbai Attacks) కేసులో కీలక పరిణామం చోటు...