Minister Jagadish Reddy | అంబేద్కర్ వల్లే తెలంగాణ వచ్చింది: మంత్రి జగదీశ్ రెడ్డి

-

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడకపోతుండే అని మంత్రి జగదీశ్ రెడ్డి(Minister Jagadish Reddy) అన్నారు. రాజ్యాంగంలో ఆయన పొందుపరిచిన ఆర్టికల్ 3 వల్లే రాష్ట్రం ఏర్పడిందని తెలిపారు. దేశం కోసం ఆయన సర్వస్వం అర్పించారని కొనియాడారు. అంబేద్కర్ లాంటి మహనీయులు మళ్లీ పుట్టబోరని అన్నారు. భువనగిరి బార్ అసోసియేషన్ న్యాయవాదుల బృందం మంత్రి జగదీష్ రెడ్డిని కలిశారు. అంబేద్కర్‌ భవన నిర్మాణం పనులు త్వరగా పూర్తయ్యేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.

- Advertisement -

దీంతో వెంటనే స్పందించిన మంత్రి(Minister Jagadish Reddy).. పూర్తి చేసేందుకు సత్వర చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అంబేద్కర్‌ భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 2 కోట్ల 40 లక్షల నిధులు మంజూరు చేసిందని తెలిపారు. భనవ నిర్మాణానికి రూ.2 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేయగా.. మిగిలిన రూ.40 లక్షలతో పాటు అవసరమైన నిధులు మంజూరు చేసి అంబేద్కర్‌ భవనాన్ని పూర్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు. అంబేద్కర్‌ వల్లే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందన్నారు.

Read Also: ఈ ఘటనపై కూడా స్మితా సబర్వాల్ గారు స్పందించాలి: BJP MLA
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...