Etela Rajender: కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలతో కేసీఆర్‌ డ్రామాలు

-

Etela Rajender: కాంగ్రెస్ నుంచి కొనుగోలు చేసి టీఆర్ఎస్‌‌కు తీసుకు వచ్చిన ఎమ్మెల్యేలతో కేసీఆర్‌ డ్రామాలు ఆడిచ్చారని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావు, పైలెట్ రోహిత్ రెడ్డిలను టీఆర్‌ఎస్‌ శ్రేణులు నిప్పు కణికలు అని అనడం హాస్యస్పదం అని, అలా అంటుంటే మా అందరికి నవ్వొస్తుందన్నారు. మునుగోడులో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి, టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డికి నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందని పేర్కొన్నారు.

- Advertisement -

2018లో 90 సీట్లతో గెలిచినా ప్రతిపక్షాలు ఉండొద్దని.. ప్రజల పక్షాన మాట్లాడొద్దు అని, కాంగ్రెస్కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో చేర్చుకోలేదా? అని కేసీఆర్‌‌ను ప్రశ్నించారు. 2014తో పాటు 2018లో విపక్షాల ఎమ్మెల్యేలను చేర్చుకుని మంత్రి పదవులు కట్టబెట్టింది నిజం కాదా? అని నిలదీశారు. మునుగోడులో కాంగ్రెస్కు డబ్బులిచ్చి కేసీఆర్ ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. నల్గొండ జిల్లా ఉద్యమాల గడ్డ అని.. చైతన్యానికి కొదవ లేని ప్రాంతం అని కొనియాడారు. ఓటు వేసేప్పుడు మునుగోడు ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని Etela Rajender సూచించారు.

Read also: బీజేపీ నేతలు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బీజేపీకి జమ్మూకశ్మీర్ ఒక పావు మాత్రమే: ప్రియాంక

జమ్మూకశ్మీర్ ఎన్నికల ప్రచారంలో బీజేపీపై కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ(Priyanka...

ఐశ్వర్యారాయ్‌ని దూరం పెట్టిన బిగ్‌బీ ఫ్యామిలీ.. వార్నింగ్ ఇచ్చిన సీనియర్ హీరోయిన్..

బిగ్ బీ అమిత్ బచ్చన్(Amitabh Bachchan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం...