Raja Singh | HYD పోలీసులపై MLA రాజాసింగ్ మరోసారి సీరియస్

-

హైదరాబాద్ పోలీసులపై బీజేపీ బహిష్కృత నేత, గోషామహల్ ఎమ్మెల్యే టి. రాజాసింగ్(Raja Singh) అసహనం వ్యక్తం చేశారు. పాస్ పోర్టు(Passport)కు దరఖాస్తు చేసి రెండు నెలలైనా పోలీసులు వెరిఫికేషన్ చేయలేదని మండిపడ్దారు. ఈ మేరకు ఆదివారం ట్విట్టర్‌లో డీజీపీ అంజనీకుమార్, సీపీ సీవీ ఆనంద్‌కు ఫిర్యాదు. ఒక ఎమ్మెల్యే పరిస్థితే ఇలా ఉంటే.. సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? అని పోలీసులను ప్రశ్నించారు. మే 25వ తేదీన దరఖాస్తు చేసుకోగా.. ఇప్పటి వరకు దానిపై ఎలాంటి అప్‌డేట్ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

గతంలో కూడా పోలీసు శాఖపై రాజాసింగ్(Raja Singh) విమర్శలు చేశారు. తనపై తప్పుడు కేసులు నమోదు చేశారని ఆయన పోలీస్ శాఖ తీరును తప్పుబట్టారు. కాగా, గతంలో మహ్మద్ ప్రవక్తపై రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, బీజేపీ నాయకత్వం అతనిపై సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. సస్పెన్షన్ ఇంకా కొనసాగుతుండటంతో బీజేపీ శ్రేణులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాజాసింగ్‌పై వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Read Also: తెలంగాణ రైతుల బాధలు తీర్చలేని కేసీఆర్.. దేశం కష్టాలు తీరుస్తారా?
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | బీజేపీ ఎంపీతో కలిసి HCU భూముల్లో రేవంత్ భారీ స్కామ్ -KTR

KTR - Revanth Reddy | కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం...

Mumbai Attacks | 26/11 ముంబై ఉగ్ర దాడుల కేసులో కీలక పరిణామం

26/11 ముంబై ఉగ్రవాద దాడుల(Mumbai Attacks) కేసులో కీలక పరిణామం చోటు...