బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం చూడాలనుందా.. ఇదే మంచి చాన్స్!

-

Bollaram Rashtrapati Nilayam |హైదరాబాద్‌లో ఉన్నటువంటి అద్భుతమైన పర్యాటక ప్రదేశాల్లో సికింద్రాబాద్‌ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం ఒకటి. ఈ రాష్ట్రప్రతి భవన్‌ను చూడటానికి సాధారణ ప్రజలకు అన్నిసార్లు అవకాశం ఉండదు. దీంతో అధికారులు అవకాశం ఇచ్చినప్పుడు మాత్రం చూసేందుకు నగరవాసులే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి వస్తుంటారు. తాజాగా.. ఆ అవకాశం మరోసారి వచ్చింది. రాష్ట్రపతి నిలయాన్ని ప్రజలు సందర్శించేందుకు ఈనెల 22న అధికారికంగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రపతి ద్రౌపది ముర్మ్ము ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని బొల్లారం రాష్ట్రపతి భవన్ అధికారులు వెల్లడించారు.

- Advertisement -

ఈనెల 14 నుంచి టికెట్స్ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. రూ. 50 చెల్లించి రిజిస్టర్ చేసుకోవాలి. 22 నుంచి లోనికి అనుమతి ఉన్నప్పటికీ ఈనెల 14 నుంచి రాష్ట్రపతి భవన్ అధికారిక వెబ్సైట్ను సందర్శించి అనుమతి కోసం రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా సూచించారు అధికారులు. భారతీయులకు టికెట్ ధర 50గా, విదేశీయులకు టికెట్ ధర ఒక్కొక్కరికి రూ. 250గా నిర్ణయించారు. సందర్శకుల సౌకర్యార్థం ఉచిత పార్కింగ్, డ్రింకింగ్ వాటర్, క్లాక్ రూమ్ ఫెసిలిటీ అందుబాటులో ఉంటాయని రాష్ట్రపతి నిలయం(Bollaram Rashtrapati Nilayam) అధికారులు వెల్లడించారు.

Read Also: ప్రధానికి లెటర్ రాసే నైతిక హక్కు కేసీఆర్ కోల్పోయారు’

Follow us on: Google News

Read more RELATED
Recommended to you

Latest news

Must read

తెలంగాణలో ప్రధాని మోదీ ఎన్నికల పర్యటన ఖరారు

తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచింది. మెజార్టీ...

Inter Results | తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి

తెలంగాణ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్‌లోని...