KCR | తెలంగాణ భవన్‌కు కేసీఆర్.. ఘనస్వాగతం పలికిన నేతలు..

-

బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) కొంతకాలం విరామం తర్వాత తెలంగాణ భవన్‌(Telangana Bhavan)కు వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత తొలిసారి తెలంగాణ భవన్‌కు వచ్చిన కేసీఆర్‌కు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. జై తెలంగాణ.. జై కేసీఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు భారీగా తరలివచ్చారు.

- Advertisement -

కృష్ణా పరివాహక జిల్లాలైన మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ జిల్లాల ప్రజాప్రతినిధులతో కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కేఆర్ఎంబీకి నీటి ప్రాజెక్టుల అప్పగింతపై కార్యాచరణ రూపొందించనున్నారు. అలాగే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధత వంటి అంశాంలపై చర్చించనున్నారు. ఇటీవల అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన కేసీఆర్(KCR).. పార్టీ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. తరుచుగా నేతలతో సమావేశమవుతూ పార్లమెంట్ ఎన్నికలకు దిశానిర్దేశం చేస్తున్నారు.

Read Also: రూ.29లకే భారత్‌ రైస్‌ను ఎలా కొనుగోలు చేయాలంటే..?
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Election Campaign: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ప్రచారం

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడింది. నెల రోజులకు పైగా...

YS Vijayamma: షర్మిలకు మద్దతు ప్రకటించిన తల్లి విజయమ్మ 

ఏపీ ఎన్నికల ప్రచారం ముగుస్తున్న సమయంలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. సీఎం...