రింగ్ రోడ్డును బీఆర్ఎస్ ప్రభుత్వం అమ్ముకుంది: మంత్రి పొన్నం

-

బీఆర్ఎస్ సర్కార్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సమయంలో కాంగ్రెస్ సర్కార్ అద్భుతమైన రింగ్ రోడ్డు(Ring Road) నిర్మించిందని, కానీ దానిని గత ప్రభుత్వం అమ్మేసుకుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్‌పై పెట్టిన ఖర్చులన్నీ తప్పుడవే అని ఆరోపించారు. అన్ని తప్పుడు లెక్కలు చూపించిన జేబులు నింపుకున్నారంటూ బీఆర్ఎస్ నేతలపై విమర్శనాస్త్రాలు సంధించారు.

- Advertisement -

గత ప్రభుత్వ హాయంలో హైదరాబాద్‌పై పెట్టిన ఖర్చు వివరాలపై బీఆర్ఎస్(BRS) చర్చలకు రావాలని ఆయన ఛాలెంజ్ చేశారు. పదేళ్లు పాలనలో హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చే ప్రయత్నం ఒక్కటైనా చేశారా? అని నిలదీశారు. పదేళ్లు అధికారంలో ఉన్నా వాటర్ లాగింగ్ సెంటర్లు అలాగే ఉన్నాయని గుర్తు చేశారు. పాతబస్తీలో మెట్రోరైలు నిర్మాణాన్ని అడ్డుకున్నది బీఆర్ఎస్ కాదా? మూసీ నిర్వాసితులకు అన్యాయం చేస్తున్నారంటున్న ప్రతిపక్షం ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని ఆయన(Ponnam Prabhakar) అన్నారు.

Read Also: అలాచేయకుంటే చావు తప్పదు.. ఉగ్రవాదులకు అమిత్ షా వార్నింగ్
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

అలా చేసుంటేనే ద్రోహం అయ్యేది: చంద్రబాబు

తిరుపతి లడ్డూ ప్రసాదం విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu)...

మహిళల కోసం రూ.లక్ష కోట్ల ఖర్చు.. మంత్రి సీతక్క హామీ

తెలంగాణ మహిళలకు మంత్రి సీతక్క(Seethakka) గుడ్ న్యూస్ చెప్పారు. మహిళల అభ్యున్నతే...