సొంత పార్టీ ఎమ్మెల్యేపై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు!

-

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి(Kadiyam Srihari) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత ఎమ్మెల్యేపై పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌(Station Ghanpur)లో అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు. ప్రజలు ఇచ్చిన ఖడ్గంతో ఆ అవినీతిని అంతమొందిస్తానన్నారు. నిజాయితీగా..మచ్చలేని నాయకుడిగా పేరు తెచ్చుకున్నానని.. స్టేషన్‌ఘన్‌పూర్‌ను అన్నీరంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యత తనదేనంటూ కడియం శ్రీహరి పేర్కొన్నారు. గతంలో మంత్రిగా ఉన్నప్పుడే ధర్మసాగర్, జాఫర్ ఘడ్, స్టేషన్ ఘనపూర్ లో తండాలకు రోడ్లు వేసుకున్నామని గుర్తుచేశారు. ఇప్పటికీ అనేక తండాలలో రోడ్లు లేకపోతే, 11 కోట్లతో రోడ్లకు మంజూరు ఇప్పించానన్నారు. గ్రామపంచాయతీగా అభివృద్ధి చెందిన తండాలకు నిధులు మంజూరు చేయిస్తానని హామీనిచ్చారు.

- Advertisement -

రాబోయే రోజుల్లో నియోజవర్గం లోని ప్రతి తండాను అభివృద్ధి చేసే బాధ్యత నాదే.. అని హామీ ఇచ్చారు. ప్రజల ఆశీర్వాదం తనపై ఉండాలని.. స్టేషన్ ఘనపూర్‌లో బంజారా భవన్ తో పాటు, సేవలాల్ భవన్ కూడా నిర్మిస్తామని స్పష్టంచేశారు. స్టేషన్ ఘనపూర్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్న ఆయన.. ఆశీర్వదించి అవకాశం ఇచ్చినప్పుడు ప్రజల అభివృద్ధికి కృషి చేయాలి.. కానీ డబ్బులు దండుకోకూడదంటూ రాజయ్యను ఉద్దేశిస్తూ పరోక్షంగా వ్యాఖ్యలుచేశారు. రాబోయే ఎన్నికల్లో స్టేషన్ ఘనపూర్ లో గులాబీ జెండా ఎగురవేయాలని కడియం(Kadiyam Srihari) పిలుపునిచ్చారు.

Read Also:
1. బ్రేకింగ్: ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ మృతి
2. అది కేసీఆర్ జేబు సంస్థ అని తేలిపోయింది: షర్మిల
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ఇండియాలో ఎంటరైన మెటా AI

భారత్ లోకి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్ మెటా ఏఐ(Meta AI) అడుగుపెట్టింది....

ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల

ఎయిర్ ఫోర్స్(Airforce) లో ఉన్నత ఉద్యోగాలకు ఉద్దేశించిన కామన్ ఎంట్రెన్స్ టెస్ట్...