BRS అంటే భారత రైతు సమితి అని మరోసారి రుజువైంది: KTR

-

రైతులకు ఇచ్చిన హామీ మేరకు పంటరుణాల మాఫీని పూర్తిచేయనున్నట్టు సీఎం కేసీఆర్‌(KCR) బుధవారం ప్రకటించారు. రుణమాఫీ ప్రారంభ ప్రక్రియ గురువారం నుంచే ప్రారంభించాలని, మొత్తం రుణాలను 45 రోజుల్లోగా పూర్తిచేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు(Harish Rao)ను సీఎం ఆదేశించారు. తాజాగా.. ఈ ప్రకటనపై మంత్రి కేటీఆర్(KTR) స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ పోస్టు పెట్టారు.

- Advertisement -

‘‘BRS అంటే భారత “రైతు” సమితి అని మరోసారి రుజువైంది. జై కిసాన్ అనేది మాకు కేవలం ఓ నినాదం కాదు.. మా ప్రభుత్వ విధానం అని మరోసారి తేలిపోయింది. కేంద్రం అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గినా.. బీజేపీ సర్కారు అడుగడుగునా ఆర్థిక ఇబ్బందులు సృష్టించినా.. రైతు రుణమాఫీని సంపూర్ణంగా పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం ముఖ్యమంత్రి కేసిఆర్ గారి సంకల్ప బలానికి నిలువెత్తు నిదర్శనం.

రైతు సంక్షేమంలో తొమ్మిదేళ్ల తెలంగాణ ప్రస్థానం.. దేశ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయం. రైతుకు రక్షణ కవచంగా అమలుచేసిన ప్రతి పథకం.. వ్యవసాయ రంగ చరిత్రపై చెరగని సంతకం. దేశవ్యాప్తంగా వ్యవసాయం అంటే సంక్షోభం.. కానీ.. ఒక్క తెలంగాణలోనే వ్యవసాయం అంటే సంతోషం. యావత్ తెలంగాణ రైతాంగం ముక్తకంఠంతో చేస్తున్న నినాదమిది.’’ అని ట్విట్టర్ వేదికగా కేటీఆర్(KTR) ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు.

Read Also: మధురానగర్‌లో దారుణం.. యువతి కొంపముంచిన పబ్జీ గేమ్!
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...