Revanth Reddy | చంద్రబాబుతో కలిసి తెలంగాణకు కేసీఆర్ అన్యాయం… -రేవంత్ రెడ్డి

-

తాను చంద్రబాబు శిష్యుడిని కాదని, సహచరుడిగా మాత్రమే టీడీపీలో పనిచేసినట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) పేర్కొన్నారు. ఎమ్మెల్సీగా గెలిచాకే టీడీపీలో చేరానన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రస్థానమే చంద్రబాబు(Chandrababu) అనుచరుడిగా మొదలైందన్నారు. తెలంగాణకు అన్యాయం జరిగేలా చంద్రబాబుతో కలసి కేసీఆర్ 610 జీవో ప్రయోజనాలు దెబ్బతినేలా గతంలో సాక్షాత్తు అసెంబ్లీలో మాట్లాడినట్లు గుర్తుచేశారు.

- Advertisement -

తెలంగాణకు కేసీఆర్(KCR) చేసిన ద్రోహంపై అమరవీరుల స్థూపం వద్ద చర్చకు సిద్ధమని రేవంత్(Revanth Reddy) సవాల్ విసిరారు. కేసీఆర్ రాకపోతే కేటీఆర్(KTR), హరీష్‌(Harish Rao)ను పంపాలన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు 25 సీట్లకు మించి రావని, అందుకే కేసీఆర్ కాంగ్రెస్‌పై దాడి చేస్తున్నారన్నారు. శాసనసభలో గద్దర్‌కు సంతాపం తెలపకపోవడం దారుణమన్నారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చ జరపడంలో ప్రభుత్వం విఫలమైందని తెలిపారు.

Read Also: ఆ విషయం గద్దర్ నాకు ముందే చెప్పారు.. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...