Delhi Liquor Scam | లిక్కర్ కేసులో కీలక పరిణామం.. కవితను నిందితురాలిగా చేర్చిన సీబీఐ..

-

ఢిల్లీ లిక్కర్ కేసు(Delhi Liquor Scam)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను నిందితురాలిగా సీబీఐ పరిగణించింది. ఈ మేరకు ఈనెల 26న విచారణకు రావాలంటూ ఆమెకు నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసులో కవితను ఈడీ అధికారులు మూడుసార్లు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. అలాగే 2022లో సీబీఐ కూడా ఆమెను ప్రశ్నించింది. తాజాగా కవితను ఈ కేసులో నిందితురాలిగా చేరుస్తూ సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -

Delhi Liquor Scam | మరోవైపు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు కూడా 41ఏ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆప్ నేతలు, మంత్రులు తమ నేతను సీబీఐ అధికారులు మరో రెండు, మూడు రోజుల్లో అరెస్ట్ చేయబోతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్‌(Arvind Kejriwal)తో పాటు కవితను కూడా అరెస్ట్ చేసే అవకాశముందనే చర్చ జోరుగా జరుగుతోంది. మరి కవిత(Kavitha) విచారణకు హాజరవుతారా..? లేదంటే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా..? అనేది తేలాల్సి ఉంది.

Read Also: రూ.500లకే సిలిండర్, ఉచిత విద్యుత్ అమలు.. ఎప్పటి నుంచంటే..?
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

హైదారాబాద్ లో మహిళా పోలీసుల కోసం వినూత్న నిర్ణయం

మహిళా పోలీసుల కోసం హైదరాబాద్ పోలీసులు వినూత్న నిర్ణయానికి శ్రీకారం చుట్టారు....

ముగ్గురు భారతీయుల్ని ఆరెస్ట్ చేసిన కెనడా పోలీస్

ఖలిస్తాన్ సపరేటిస్ట్ లీడర్ హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Nijjar) హత్యకేసులో ముగ్గురు...