డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించండి.. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం 

-

బీజేపీ సీనియర్ నేత డీకే అరుణ(DK Aruna)ను గద్వాల ఎమ్మెల్యేగా ప్రకటించాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. హైకోర్టు తీర్పు కాపీని లేఖకు జత చేస్తూ సీఈవోకు ఈసీ అండర్ సెక్రటరీ సంజయ్ కుమార్ లేఖ పంపించారు. ఈ క్రమంలో హైకోర్టు ఉత్తర్వులను తదుపరి గెజిట్‌లో ప్రచురించాలని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలను అమలుచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.

- Advertisement -

2018ఎన్నికల్లో గద్వాల నియోజకవర్గం నుంచి డీకే అరుణ(DK Aruna)పై కృష్ణమోహన్ రెడ్డి(Krishna Mohan Reddy) ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే నామినేషన్ సందర్భంగా తప్పుడు వివరాలు సమర్పించారని అరుణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై సుదీర్ఘ విచారణ జరిపి హైకోర్టు కృష్ణమోహన్ రెడ్డిపై అనర్హత వేటు వేసింది. అంతేకాకుండా తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసినందుకు శిక్షగా రూ.2.50 లక్షలు జరిమానా విధించింది. కోర్టు ఖర్చుల కింద డీకే అరుణకు రూ.50వేలు చెల్లించాలని తీర్పు చెప్పింది. డీకే అరుణను 2018 డిసెంబర్ 12 నుండి ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ తుది తీర్పు వెలువరించింది. దీనిపై ఆమె అసెంబ్లీ సెక్రటరీని కలిసి హైకోర్టు తీర్పు ప్రతిని అందజేశారు. న్యాయస్థానం తీర్పును గౌరవిస్తూ తనను ఎమ్మెల్యేగా ప్రకటించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా లేఖ రాశారు.

Read Also: ఎన్నికల కమిటీని ప్రకటించిన కాంగ్రెస్.. తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కరికే చోటు
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) దేశంలోనే రెండో అత్యున్నతమైన పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు. రాష్ట్రపతి...

జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దు: సీబీఐ

YS Jagan Foreign Tour | విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి...