Chandrababu | కేసీఆర్‌ను పరామర్శించిన చంద్రబాబు

-

టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను పరామర్శించారు. ఆసుపత్రికి వచ్చిన చంద్రబాబును మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత.. కేసీఆర్ చికిత్స పొందుతున్న గదికి తీసుకెళ్లారు. అనంతరం కేసీఆర్‌తో చంద్రబాబు మాట్లాడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌(KCR)కు జరిగిన తుంటి మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా జరిగిందని వైద్యులు చెప్పారని.. కోలుకునేందుకు ఆరు వారాల సమయం పడుతుందని తెలిపారు. కేసీఆర్ త్వరగా కోలుకుని మళ్లీ ప్రజాసేవలో పునరంకితం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించారు. బాబు వెంట పలువురు టీడీపీ నేతలు ఉన్నారు.

- Advertisement -

Chandrababu, Bhatti Vikramarka Visit KCR | ఇక తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌, బీఎస్పీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్‌(RS Praveen Kumar), సినీ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్‌, మాజీ మంత్రులు గంగుల కమలాకర్, మల్లారెడ్డి, మోత్కుపల్లి నరస్సింహులు, ఎంపీ మాలోత్ కవిత, మాజీ స్సీకర్ మధుసూదన చారి తదితరులు కేసీఆర్‌ను పరామర్శించారు. ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్‌ను పరామర్శించిన సంగతి తెలిసిందే.

RS Praveen Kumar

Bhatti Vikramarka

Read Also: Article 370 రద్దుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

మహాసేన రాజేష్ యూటర్న్.. జనసేనను ఓడిస్తామని సంచలన వ్యాఖ్యలు..

ఏపీ ఎన్నికల వేళ అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. తాజాగా జనసేన పార్టీకి...

అంబటి రాంబాబు వ్యాఖ్యలపై అల్లుడు మరో వీడియో

ఏపీ ఎన్నికలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే మంత్రి అంబటి రాంబాబు(Ambati...