తెలంగాణలో బీజేపీతో పొత్తుపై చంద్రబాబు క్లారిటీ

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై టీడీపీ దృష్టి సారించింది. అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించేందుకు ఓ కమిటీని నియమించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu).. తాజాగా తెలంగాణలో పోటీ చేసే స్థానాల సంఖ్యపై స్పష్టత ఇచ్చారు. ఈ మేరకు చంద్రబాబు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. అన్ని నియోజకవర్గాల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని స్పష్టం చేశారు.

- Advertisement -

బీజేపీ(BJP)తో పొత్తుకు తెలంగాణలో సమయం మించిపోయిందని తెలిపారు. ప్రస్తుతం తాను ఏపీ పునర్నిర్మానంపై దృష్టి సారించినట్లు తెలిపారు. బీజేపీతో అంతర్గతంగా ఏం చర్చిస్తున్నామనేది ఎవరికీ తెలియదన్నారు. తాను చూడని రాజకీయం లేదని.. దేశ నిర్మాణంలో భాగం కవాలన్నది తన ఉద్దేశ్యమని తెలిపారు. అది ఎలా అనేది కాలం నిర్ణయిస్తుందన్నారు. ప్రత్యేక హోదా కోసమే ఎన్డీయే నుంచి బయటకు వచ్చినట్లు ఆయన(Chandrababu) చెప్పుకొచ్చారు.

Read Also: సీటు వదిలేయడానికి సిద్ధం.. ఎంపీ కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....

THSTI లో ప్రాజెక్ట్ రీసెర్చ్ స్టాఫ్ కి నోటిఫికేషన్

ఫరీదాబాద్ (హరియాణా)లోని ప్రభుత్వరంగ సంస్థకు చెందిన ట్రాన్టేషనల్ హెల్త్ సైన్స్ అండ్...