పంటనష్టాన్ని వెంటనే అందించండి.. అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం

-

CM KCR |ఇటీవల రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాల వల్ల భారీగా పంటనష్టం జరిగిన విషయం తెలిసిందే. దీంతో సీఎం కేసీఆర్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి పంటనష్టం వివరాలను తెలుసుకున్నారు. నష్టపరిహారంగా ఎకరానికి రూ.10 వేలు సాయం చేస్తామని ప్రకటించారు. తాజాగా.. ఈ విషయమై మంగళవారం ప్రగతి భవన్‌లో అధికారులతో సీఎం(CM KCR) సమీక్ష నిర్వహించారు. నష్ట పోయిన పంటలకు ఎకరాకు రూ.10 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయా జిల్లా కలెక్టర్లు తమ తమ జిల్లా పరిధిలో, క్లస్టర్ల వారీగా స్థానిక వ్యవసాయ అధికారులతో (ఏఈవో) సర్వే చేయించి జరిగిన పంట నష్టం వివరాలను పూర్తి సమాచారాన్ని సేకరించి ప్రభుత్వానికి అందజేయాలన్నారు. ఈ మేరకు తక్షణ చర్యలు ప్రారంభించాలని సీఎస్ శాంతి కుమారికి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావును ఆదేశించారు. పంట దెబ్బతిన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా ఈ నిధులను జమ చేయాలని స్పష్టం చేశారు.

- Advertisement -
Read Also: ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వాడే వారికి కేంద్రం బిగ్ షాక్

Follow us on: Google News, Koo, Twitter

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Prasanna Vadanam | ‘ప్రసన్న వదనం’ ట్రైలర్ విడుదల.. సస్పెన్స్ అదిరిపోయిందిగా..

యువ హీరో సుహాస్(Suhas) వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు ఇటీవలే...

Malla Reddy | మల్కాజిగిరిలో నువ్వే గెలుస్తున్నావ్.. ఈటలతో మల్లారెడ్డి

తెలంగాణ మాజీ మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి(Malla Reddy)...