Medigadda Barrage | మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన సీఎం రేవంత్ బృందం

-

మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage)ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పరిశీలించారు. తొలుత బ్యారేజీ పైనుంచి కుంగిన పిల్లర్లను పరీశీలించిన నేతలు.. కుంగిన పిల్లర్ల వద్ద ఏం జరిగిందో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత 21వ పిల్లర్ వద్ద కుంగిన ప్రాంతం, పగుళ్లు ఏర్పడిన ప్రాంతాన్ని సీఎం బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా రూ.95వేల కోట్లను ఖర్చు చేస్తే.. 97 వేల ఎకరాలకు కూడా నీరు అందడం లేదని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ట్వీట్ చేశారు. కేసీఆర్ ధన దాహానికి కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) బలైదంని విమర్శించారు.

- Advertisement -

అంతకుముందు సీఎం బృందం అసెంబ్లీ నుంచి నేరుగా ప్రత్యేక బస్సుల్లో మేడిగడ్డ(Medigadda Barrage) బయలుదేరి వెళ్లారు. అయితే ఈ పర్యటనకు బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు కృష్ణా జలాలపై పోరాటం అంటూ నల్గొండలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతలు హాజరయ్యారు.

Read Also: నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.. వైసీపీ నేతలకు షర్మిల సవాల్..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్...