CM Revanth Reddy | ఉచిత విద్యుత్, రూ.500లకే సిలిండర్ ప్రకటించిన సీఎం

-

త్వరలోనే 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాలను ప్రారంభిస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్‌లోని నాగోబా దర్బార్‌లో స్వయం సహాయక సంఘాలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీపం పథకం ద్వారా గత కాంగ్రెస్ ప్రభుత్వం సిలిండర్, గ్యాస్ పొయ్యి ఇచ్చిందని గుర్తు చేశారు. అప్పుడు సిలిండర్ ధర రూ.400 మాత్రమే ఉండేదని కానీ ఆ తర్వాత నరేంద్ర మోదీ(Modi), కేసీఆర్(KCR) కలిసి రూ.1200కు పెంచారని విమర్శించారు.

- Advertisement -

దీంతో మహిళలకు ఊరట కలింగించేలా సిలిండర్‌ను రూ.500కే అందిస్తామని పునరుద్ఘాటించారు. ప్రియాంక గాంధీ చేత ఈ పథకం ప్రారంభిస్తామని చెప్పకొచ్చారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పిస్తే బీఆర్ఎస్ నేతలకు కడుపు నొప్పి ఎందుకో అర్థం కావడం లేదని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు కాలేదని.. అప్పుడు బీఆర్ఎస్ నేతలు శాపనార్థాలు పెడుతున్నారని రేవంత్ మండిపడ్డారు. రేవంత్(CM Revanth Reddy) వెంట డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు సీతక్క, కొండా సురేఖ ఉన్నారు.

Read Also: తిన్న కంచంలో చెయ్యి కడగకూడదు అంటారు ఎందుకు?
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...