CM Revanth Reddy | ఉచిత విద్యుత్, రూ.500లకే సిలిండర్ ప్రకటించిన సీఎం

-

త్వరలోనే 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాలను ప్రారంభిస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్‌లోని నాగోబా దర్బార్‌లో స్వయం సహాయక సంఘాలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీపం పథకం ద్వారా గత కాంగ్రెస్ ప్రభుత్వం సిలిండర్, గ్యాస్ పొయ్యి ఇచ్చిందని గుర్తు చేశారు. అప్పుడు సిలిండర్ ధర రూ.400 మాత్రమే ఉండేదని కానీ ఆ తర్వాత నరేంద్ర మోదీ(Modi), కేసీఆర్(KCR) కలిసి రూ.1200కు పెంచారని విమర్శించారు.

- Advertisement -

దీంతో మహిళలకు ఊరట కలింగించేలా సిలిండర్‌ను రూ.500కే అందిస్తామని పునరుద్ఘాటించారు. ప్రియాంక గాంధీ చేత ఈ పథకం ప్రారంభిస్తామని చెప్పకొచ్చారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పిస్తే బీఆర్ఎస్ నేతలకు కడుపు నొప్పి ఎందుకో అర్థం కావడం లేదని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు కాలేదని.. అప్పుడు బీఆర్ఎస్ నేతలు శాపనార్థాలు పెడుతున్నారని రేవంత్ మండిపడ్డారు. రేవంత్(CM Revanth Reddy) వెంట డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు సీతక్క, కొండా సురేఖ ఉన్నారు.

Read Also: తిన్న కంచంలో చెయ్యి కడగకూడదు అంటారు ఎందుకు?
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Ponnam Prabhakar | బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ మొదలైంది: పొన్నం ప్రభాకర్

తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్లు అందిస్తామన్న మాటపై కాంగ్రెస్ నిలబడి ఉందని...

Hyderabad | లిఫ్ట్‌లో ఇరుక్కున్న బాలుడు.. ఆసుపత్రిలో మృతి

Hyderabad | నాంపల్లిలో రెడ్‌హిల్స్ శాంతినగర్ పార్కు ఎదురుగా ఉన్న మఫర్...