ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు ఏమైనా తెలిశాయా అని అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడి పరిస్థితులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy), సాగునీటి పారుదల శాఖ సహాదారు ఆదిత్యనాథ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో(Vem Narender Reddy) సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్బంగా సహాయక చర్యల్లో మరింత వేగం పెంచాలని సూచించారు సీఎం. అదే విధంగా ఈ ఘటనలో(SLBC) గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందన్న అంశంపై కూడా సీఎం ఆరా తీశారు. ఒక్క ప్రాణం కూడా పోకుండా రెస్క్యూ ఆపరేషన్ విజయవంతం చేయాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.