నేను కాంగ్రెస్ మనిషినే.. సొంతగూటికి చేరాక ధర్మపురి శ్రీనివాస్

-

మాజీ రాజ్యసభ సభ్యుడు, సీనియర్ నాయకులు ధర్మపురి శ్రీనివాస్(D Srinivas) కాంగ్రెస్‌ పార్టీలో చేశారు. ఆదివారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం తీర్థం పుచ్చుకున్నారు. అంతకముందు.. తాను పార్టీలో చేరడం లేదని, తన కుమారుడు చేరుతున్నాడని డీ.శ్రీనివాసరావు ఆదివారం ఉదయం ఒక లేఖ విడుదల చేశారు. ఆరోగ్యం సహకరిస్తే గాంధీ భవన్‌కు వెళ్లి సంజయ్‌ని ఆశీర్వదిస్తానని లేఖలో పేర్కొన్నారు. తాను కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నానని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఆ లేఖలో DS రాశారు. కానీ, కాసేపటికే ఆయన వీల్‌ ఛైర్‌లో గాంధీ భవన్‌కు వచ్చారు. అదే సమయంలో ప్రజాక్షేత్రంలో నా మరో కుమారుడు అరవింద్‌ మంచి పేరు తెచ్చుకుంటున్నారని డిఎస్ (D Srinivas) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను కాంగ్రెస్ మనిషినే అని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇన్‌చార్జ్‌ మాణిక్‌రావ్‌ ఠాక్రే, వీహెచ్, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేణుకా చౌదరి పాల్గొన్నారు.

- Advertisement -
Read Also: మంత్రి జగదీశ్ రెడ్డి పాత్రపై విచారణ చేయాలి: RS ప్రవీణ్ కుమార్

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YS Sharmila | ‘నవ సందేహాలు’ పేరుతో సీఎం జగన్‌కు షర్మిల మరో లేఖ

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) సీఎం జగన్‌కు 'నవ సందేహాల'...

Andhra Pradesh | ఏపీలో మొత్తం ఓటర్లు ఎంత మంది అంటే..?

ఏపీ(Andhra Pradesh)లో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని రాష్ట్ర...