రూపాయి ఖర్చు పెట్టలేను.. ఈటల రాజేందర్ ఆవేదన

-

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Eatala Rajender) కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో రూపాయి ఖర్చు పెట్టే పరిస్థితుల్లో లేనని తెలిపారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో నిర్వహించిన ప్రచారంలో ఆయన మాట్లాడుతూ గత ఉప ఎన్నికల్లో సీఎం కేసీఆర్ తనను చాలా ఇబ్బందులు పెట్టారని.. అయినా ప్రజల ఆశీర్వాదంతో గెలిచానని తెలిపారు. కానీ ఇప్పుడు తాను కొన ఊపిరితో కొట్లాడుతున్నానని.. ఇప్పుడు రూపాయి కూడా ఖర్చు పెట్టే పరిస్థితుల్లో లేనని.. తన వెంట ఉన్నది కేవలం ధైర్యలక్ష్మి మాత్రమే అని వాపోయారు.

- Advertisement -

డబ్బులు ఉంటేనే రాజకీయం చేయడం కాదని, డబ్బులు లేకపోయినా తాను రాజకీయం చేస్తున్నానని పేర్కొన్నారు. ఇతర పార్టీల అభ్యర్థులు ఓటుకు రూ.2 వేలు, రూ.3వేలు ఇస్తే తీసుకోవాలని కానీ కమలం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తన శక్తి, ధైర్యం అంతా హుజూరాబాద్ ప్రజలే అని ఈటల వెల్లడించారు. కాగా హుజురాబాద్‌తో పాటు గజ్వేల్‌లో కేసీఆర్‌(KCR)పై ఈటల(Eatala Rajender) పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

Read Also: వరల్డ్ రికార్డు సృష్టించిన కెప్టెన్ రోహిత్ శర్మ
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | బీజేపీ ఎంపీతో కలిసి HCU భూముల్లో రేవంత్ భారీ స్కామ్ -KTR

KTR - Revanth Reddy | కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం...

Mumbai Attacks | 26/11 ముంబై ఉగ్ర దాడుల కేసులో కీలక పరిణామం

26/11 ముంబై ఉగ్రవాద దాడుల(Mumbai Attacks) కేసులో కీలక పరిణామం చోటు...