Polling Time | తెలంగాణ ఎన్నికల్లో పోలింగ్ సమయం పెంపు

-

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల(Polling Time) పోలింగ్ సమయాన్ని పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇప్పటికే 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని.. వేసవి తీవ్రత దృష్ట్యా పోలింగ్ సమయాన్ని పెంచాలని అభ్యర్థులు ఈసీకి విజ్ఞప్తి చేశారు. ఎండలు విపరీతంగా ఉండంటతో పట్ణణాల్లో జనాలు బయటకు రారని.. ఈ ప్రభావం పోలింగ్‌పై ఉంటుందని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో వారి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ఈసీ పోలింగ్ సమయం గంట పాటు పెంచుతూ ఆదేశాలు జారీచేసింది.

- Advertisement -

Polling Time | సాధారణంగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ నిర్వహించనున్నారు. అయితే ఈసీ నిర్ణయంతో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. కానీ మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలైన 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం 4 గంటల వరకూ మాత్రమే పోలింగ్ నిర్వహించనున్నారు. కాగా రాష్ట్రంలోని 17 నియోజకవర్గాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు ఈ నెల 13న పోలింగ్ జరగనుండగా.. జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి.

Read Also: తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదల
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sathya Sai District | ఏపీలో ఒకే ఫ్యామిలీలో నలుగురు మృతి… సైనైడ్ కారణమా?

ఏపీ శ్రీ సత్యసాయి జిల్లాలో(Sathya Sai District) దారుణ ఘటన చోటు...

HCU Land Dispute | ‘భూమి బదిలీకి HCU అంగీకరించలేదు’

HCU Land Dispute | హైదరాబాద్ విశ్వవిద్యాలయం (HCU) సోమవారం 2024...