బ్యాంకును ముట్టడించిన రైతులు.. ఎందుకంటే?

-

Kamareddy | రుణమాఫీ కోసం కామారెడ్డి జిల్లా రెంజల్ లోని బ్యాంకును రైతులు ముట్టడించారు. అన్ని అర్హతలు ఉన్నా రుణమాఫీ కాలేదు.. ఆఫీసులు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా సమాధానం లేదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక కెనరా బ్యాంకులో వేలాది మంది రైతులు పంట రుణాలు తీసుకున్నారు. కొన్నేండ్లుగా రెన్యూవల్ చేసుకుంటూ వస్తున్నారు.

- Advertisement -

Kamareddy | కాంగ్రెస్ ప్రభుత్వం రెండు విడుతల్లో కలిపి రూ.లక్షన్నర లోపు క్రాప్ లోన్లను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించడంతో తమకు రుణబాధ తప్పిందని సంతోషపడ్డ రైతులకు ఊహించని షాక్ తగిలింది. జాబితాలో వారి పేరు లేదు, ఖాతాల్లో డబ్బులు పడలేదు. దీంతో ఆందోళనకు గురైన రైతులు 15 రోజులుగా ఆఫీసులు, బ్యాంకు చుట్టూ తిరుగుతున్నారు. అయినా సరైన సమాధానం దొరకలేదని ఆగ్రహానికి గురైన వందలాది రైతులు కెనరా బ్యాంక్ ఎదుట బైఠాయించారు. రుణాలను తక్షణమే మాఫీ చేయాలని, లేకపోతే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.

Read Also: టీ లవర్స్‌కు వార్నింగ్.. క్యాన్సర్ కోరల్లో ఉన్నట్లే..!
Follow Us On: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

తిరుపతి లడ్డూ తయారీ నెయ్యిలో పశువుల కొవ్వు.. సీఎం సంచలన వ్యాఖ్యలు

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం(Tirumala Prasadam) తయారీలో పశువుల కొవ్వులు కలిపారని,...

‘వైసీపీలో ఏడ్చిన రోజులు ఉన్నాయి’.. పార్టీ మార్పుపై బాలినేని క్లారిటీ..

ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి(Balineni Srinivasa Reddy).. వైసీపీకి...