Supreme court : ఫాంహౌస్ కేసు విచారణ వాయిదా.. సుప్రీంకోర్టు

-

Farmhouse Case hearing adjourned in Supreme Court :తెలంగాణలో ప్రకంపనలు సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. స్థానిక కోర్టులో ఈ రోజు బెయిల్ పిటిషన్‌పై ఉత్తర్వులు రానున్న క్రమంలో విచారణను శుక్రవారానికి వాయిదా వేయాలని నిందితుల తరపు న్యాయవాది సుప్రీంకోర్టును కోరారు. కాగా ఈ కేసు పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విక్రమ్‌నాథ్‌లు విచారణ ఈనెల 21కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే.. ఈ కేసులో హైకోర్టు నిందితుల బెయిల్‌ను నిరాకరించి రిమాండ్‌కు అనుమతి ఇవ్వడంతో, హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ నిందితులు సుప్రీంను ఆశ్రయించారు. కాగా.. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఏసీబీ ప్రత్యేక కోర్టు బెయిల్ పిటిషన్‌‌పై ఉత్తర్వులు ఇవ్వనుంది.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

పెళ్ళై పిల్లలున్న వ్యక్తితో డేటింగ్‌పై సాయిపల్లవి క్లారిటీ

సాయి పల్లవి(Sai Pallavi) ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. నేచురల్ బ్యూటీగా...

అసెంబ్లీలో వాళ్లందర్నీ నిలబెట్టిన సీఎం..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని...