తెలంగాణాలోని ఎస్టీలకు శుభవార్త

-

తెలంగాణాలోని ఎస్టీలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని గిరిజన రిజర్వేషన్ల శాతాన్ని 6 నుంచి 10 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన రిజర్వేషన్లు తక్షణమే అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో సర్కారు స్పష్టం చేసింది. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా ఉత్తర్వులను విడుదల చేశారు. ప్రత్యేక పరిస్థితులున్న కారణంగానే ఎస్టీ రిజర్వేషన్లు పెంచుతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గిరిజనులకు 6 శాతంగా ఉన్న రిజర్వేషన్‌నే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా కొనసాగిస్తూ వచ్చారు. కాగా, రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో ఉన్న గిరిజన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్‌ పెంచుతామని సీఎం కేసీఆర్‌ చెప్పినట్లే.. నేడు 10 శాతానికి పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...