50 ఏండ్లు అవకాశమిస్తే ఏం చేశారు?: గుత్తా

-

శాసన మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి(Gutha Sukender Reddy) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యమ సమయంలో కన్న కలలు అన్నింటినీ సీఎం కేసీఆర్‌ సాకారం చేస్తున్నారని తెలిపారు. అభివృద్ధిని గుర్తించకుండా ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అనవసర ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని హితవుపలికారు. ప్రతిపక్షాలు మాట్లాడుతున్న భాష ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని పేర్కొన్నారు.

- Advertisement -

నిర్లజ్జగా, అడ్డగోలుగా ఆరోపణలు చేయడం రేవంత్‌ రెడ్డి(Revanth Reddy)కి పరిపాటిగా మారిందని.. కేసీఆర్‌ పై వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్‌ లీడర్లు ఒక్క ఛాన్స్‌ అని అడుగుతున్నారని.. 50 ఏండ్లు అవకాశమిస్తే ఏం చేశారని నిలదీశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడంలో జాప్యం చేయడం వల్ల వేలాది మంది యువకులు బలిదానాలు చేసుకున్నారని.. అందుకే కాంగ్రెస్‌ ను కూడా ప్రజలు నమ్మరని అన్నారు. కేంద్రం ఒక్క మంచి పని కూడా చేయలేదని గుత్తా సుఖేందర్‌ రెడ్డి(Gutha Sukender Reddy) విమర్శించారు. తెలంగాణలో ఓట్లు అడిగే హక్కు బీజేపీ(BJP)కి లేదని స్పష్టం చేశారు.

Read Also: గృహలక్ష్మి పథకానికి ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....

THSTI లో ప్రాజెక్ట్ రీసెర్చ్ స్టాఫ్ కి నోటిఫికేషన్

ఫరీదాబాద్ (హరియాణా)లోని ప్రభుత్వరంగ సంస్థకు చెందిన ట్రాన్టేషనల్ హెల్త్ సైన్స్ అండ్...