కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా: కోమటిరెడ్డి

-

కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komatireddy Venkat Reddy) అన్నారు. శనివారం కాంగ్రెస్ పార్టీ డీసీసీ నూతన అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రమాణ స్వీకారానికి కోమటిరెడ్డి వచ్చారు. ఈ సందర్భంగా తొలిసారిగా జనగామకు వచ్చిన సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కోమటిరెడ్డికి పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి, కొమ్మురిచే బాధ్యతలు స్వీకరింప చేశారు.

- Advertisement -

అనంతరం జరిగిన సమావేశంలో కోమటిరెడ్డి(Komatireddy Venkat Reddy) మాట్లాడుతూ.. జనగామలో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి(Muthireddy Yadagiri Reddy) భూకబ్జాలు అధికమయ్యాయని, ఆయన అక్రమాలకు ముగింపు పలకాలంటే జనగామ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరాలని కొమ్మూరి కోరారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన కుటుంబ అవినీతి పెచ్చు పెరిగిపోయిందని విమర్శించారు. అదేవిధంగా జిల్లాలోని జనగామ, స్టేషన్గన్పూర్, పాలకుర్తి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేయాల్సిన బాధ్యత కూడా పార్టీ కార్యకర్తలపై ఉందన్నారు.

Read Also: నా మీద ఇంత ఓర్వలేనితనం ఏందిరా బై..? జగ్గారెడ్డి సీరియస్!!
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...