ప్రజలు జాగ్రత్త.. తెలంగాణలో ఠారెత్తించునున్న ఎండలు

-

Heat Waves |తెలంగాణలో మూడు రోజుల పాటు ఎండలు మండిపోనున్నాయి. నేటి నుంచి సోమవారం వరకు రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. వాయవ్య, పశ్చిమ దిశల నుంచి దిగువ స్థాయి గాలులు తెలంగాణ వైపు బలంగా వీస్తుండటంతో పొడి వాతావరణం నెలకొందని పేర్కొంది. ఈ కారణంతో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల వరకు నమోదయ్యే సూచనలు ఉన్నాయంది. అంతేకాకుండా వచ్చే నెల ఒకటి నుంచి మరో ఐదు రోజులపాటు ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలను కూడా తాకే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించది. ఇప్పటికే నల్గొండ జిల్లా దామరచర్లలో గరిష్ఠంగా 44.3 డిగ్రీలు అత్యధిక ఉష్ణోగ్రత నమోదైందని వెల్లడించింది. వడగాలులు(Heat Waves) కూడా విచే అవకాశం ఉందని వడదెబ్బ బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.. మధ్యాహ్న వేళల్లో అవసరమైతేనే బయటకు రావాలని సూచించింది.

- Advertisement -
Read Also:
1. ఇకపై ఆలయాల్లోకి వెళ్లాలంటే డ్రెస్ కోడ్ ఉండాల్సిందే!
2. వేసవిలో ఈ ఫుడ్స్ రోజువారీ డైట్ లో చేరిస్తే మంచి బెనిఫిట్స్

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

హైదారాబాద్ లో మహిళా పోలీసుల కోసం వినూత్న నిర్ణయం

మహిళా పోలీసుల కోసం హైదరాబాద్ పోలీసులు వినూత్న నిర్ణయానికి శ్రీకారం చుట్టారు....

ముగ్గురు భారతీయుల్ని ఆరెస్ట్ చేసిన కెనడా పోలీస్

ఖలిస్తాన్ సపరేటిస్ట్ లీడర్ హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Nijjar) హత్యకేసులో ముగ్గురు...