Alert |మండుతున్న ఎండలు.. బయటకు రావొద్దని హెచ్చరిక

-

Heat Waves |ఎండలు మండిపోనున్నాయని భాతర వాతావరణశాఖ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. వచ్చే వారం రోజుల్లో ఎండలు మరింత పెరగడంతో పాటు వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. సాధారణ డిగ్రీల కంటే ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని చెప్పింది. దీంతో అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని సూచించింది. మరోవైపు హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా ఎల్లో అలర్జ్ జారీ చేసింది. భాగ్యనగరంలో గరిష్ట ఉష్టోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది.

- Advertisement -

నగరంతో పాటు ఆదిలాబాద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, నారాయణపేట్ జిల్లాల్లో కూడా ఉష్ణోగ్రతలు( Heat Waves) మరింత పెరుగుతాయని హెచ్చరించింది. ఎండ తీవ్రత పెరగనున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.. ముఖ్యంగా మధ్యాహ్నం సమయాల్లో అనవసరమైన పనులకు బయటకు రావొద్దని పేర్కొంది. సోమవారం గరిష్టంగా భద్రాచలంలో 39డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని తెలిపింది. అటు ఏపీలో కూడా ఎండలు ఠారెత్తిస్తున్నాయి. సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల ఎక్కువ ఉష్ణోగ్రలు నమోదవుతున్నాయి. కాగా దాదాపు 100 సంవత్సరాల తర్వాత ఈ ఏడాది దేశంలో భానుడి భగభగలు ఉండనున్నాయి.

Read Also: నిన్నటితో పోలిస్తే స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....

THSTI లో ప్రాజెక్ట్ రీసెర్చ్ స్టాఫ్ కి నోటిఫికేషన్

ఫరీదాబాద్ (హరియాణా)లోని ప్రభుత్వరంగ సంస్థకు చెందిన ట్రాన్టేషనల్ హెల్త్ సైన్స్ అండ్...