KCR | ఆసుపత్రి నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ డిశ్చార్జ్

-

వారం రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) డిశ్చార్జ్‌ అయ్యారు. ఆసుపత్రి నుంచి బంజారాహిల్స్ నందిన‌గ‌ర్‌లోని త‌న సొంతింటికి వెళ్లారు. కేసీఆర్ వెంట మాజీ మంత్రులు కేటీఆర్(KTR), హ‌రీశ్‌రావు(Harish Rao), ఎంపీ సంతోష్‌ కుమార్, ఇతర నేతలు ఉన్నారు. గాయం నుంచి పూర్తిగా కోలుకోవాలంటే రెండు నెలలు పైగా పడుతుందని వైద్యులు చెప్పడంతో ఆయన అక్కడే విశ్రాంతి తీసుకోనున్నారు. అయితే ఇంట్లోనే కొన్ని రోజులు పాటు ఫిజియోథెరపీ చికిత్స చేయనున్నారు.

- Advertisement -

ఈ క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy), టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu), తెలంగాణ మంత్రులు, సినీ ప్రముఖులు, తదితరులు ఆయనను పరామర్శించి త్వరగా కోలుకుని ఆకాంక్షించారు. కాగా డిసెంబర్ 7న ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రం నివాసంలో కేసీఆర్(KCR) కాలు జారి కింద పడిన సంగతి తెలిసిందే. తుంటి ఎముక విరగడంతో వైద్యులు సర్జరీ చేసి హిప్ బోన్ రీప్లేస్‌మెంట్ ఆపరేషన్ నిర్వహించారు.

Read Also: సెల్ఫ్ గోల్ వేసుకోడంలో జగన్‌ను మించినోడు లేడు: జనసేన
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...

RRR Custodial Case | RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case)...