Ews Reservations: EWS రిజర్వేషన్లపై మాజీ ఐఏఎస్ కీలక వ్యాఖ్యలు

-

Key comments of former ias of telangana on Ews Reservations: అగ్రవర్ణాల్లోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్)కు 10 శాతం కోటా రిజర్వేషన్లను సుప్రీంకోర్టు సమర్ధించిన విషయం తెలిసిందే.. ఈక్రమంలో ఈ అంశంపై మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి స్పందించారు. ఈ సందర్భంగా.. శనివారం ఆయన ట్విట్టర్‌‌లో ఓ వీడియోను విడుదల చేశారు. దీనిలో ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అగ్రవర్ణాలకు రిజర్వేషన్ల (Ews Reservations) విషయంలో ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు ఉండవద్దని అన్నారు. కానీ గతంలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు పెంచాలని పలు కమిటీలు, గత ప్రభుత్వాలు చేసిన సిఫార్సులను సుప్రీంకోర్టు ఖండించిందని… ఇప్పుడు అదే సుప్రీంకోర్టు తన తీర్పును తానే తూచ్ అని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు ఎందుకు ధ్వంద వైఖరి చూపిస్తుందని నిలదీశారు. గతంలో బీసీల కోటా పెంచాలని అడిగితే రిజర్వేషన్ల సీల్ 50 శాతం దాటకూడదని చెప్పిన సుప్రీంకోర్టు ఇప్పుడు ఏందుకు అగ్రకులాల విషయంలో మరో నీతి అవలంభిస్తోందని అన్నారు.

- Advertisement -

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

రేవంత్ రెడ్డికి హరీష్ రావు ఛాలెంజ్..

మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి...

హర్మన్ ప్రీత్‌కు టీమిండియా పగ్గాలు..

న్యూజిలాండ్‌(New Zealand)తో వన్డే సిరీస్‌కు భారత మహిళల జట్టు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే...